Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: సత్తుపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు

Khammam: సత్తుపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో తన సహచర సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి పలు కార్యక్రమాలలో అతిథిగా పాల్గొన్నారు.హెలికాప్టర్ ద్వారా కల్లూరుకు చేరుకున్న మంత్రులు,ఎంపీలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికారు.అటుతర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించే, సాగునీటి శాఖకు చెందిన నూతన భవన నిర్మాణ పనులకు భూమిపూజ, బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ వద్దిరాజు పాల్గొన్నారు.అనంతరం పెనుబల్లిలో మంత్రి హరీష్ రావు గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వాసుపత్రి ఉన్నతీకరణకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో మంత్రులు తన్నీరు, పువ్వాడ, ఎంపీలు నామా,వద్దిరాజు, బండి, ఎమ్మెల్యే సండ్ర,ఎమ్మెల్సీ మధులకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది, గులాబీ శ్రేణులు మేళ తాళాలతో ఆత్మీయ స్వాగతం పలికారు.అటుతర్వాత జరిగిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ,ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News