Tuesday, September 17, 2024
HomeతెలంగాణKhammam: మా ఓర్పు చేతగానితనం కాదు: లింగాల

Khammam: మా ఓర్పు చేతగానితనం కాదు: లింగాల

దిక్కూ మొక్కూ లేనివాళ్లంతా మంత్రి పువ్వాడపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న లింగాల.. కేసీఅర్ ను గద్దె దింపుతాం అనే పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని, అసలు మీ వల్ల ప్రజలకు ఒరిగింది భవిష్యత్ లో ఒరిగేది ఏమి లేదని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజకీయాలు అంటే విలువలు ఉండాలి, నిబద్దత ఉండాలని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం నింపిన పువ్వాడ కుటుంబంకు ఓ చరిత్ర ఉందన్నారు. స్థాయిని మరిచి విమర్శలు చేయడం సిగ్గుచేటని, మా ఓర్పును చేతకాని తనం అనుకుంటే దాని పర్యవసానంగా చవిచూస్తారని హెచ్చరించారు. కేసీఅర్ నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు గెలుస్తాం అని స్పష్టం చేశారు. మీ దగ్గర రాజకీయ నిబద్దత లేదు, రాజకీయ ఎజెండా లేదన్నారు. ఎంతో చైతన్యమైన ఖమ్మం జిల్లా మీరు భ్రష్టు పట్టిస్తున్నరని విమర్శించారు. జర్నలిస్ట్ లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇళ్ళ స్థలాల హామీని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాబినేట్ లో అమోదింపజేస్తే.. అభినందించకపోగా దానిపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు లింగాల.
మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ ..అయ్యా విజయ్ బాబు మీరు బ్యాంక్ చైర్మన్ గా ఉన్న కాలంలో ఏం చేశారో మాకు తెలుసు. నోరు తేరిస్తే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకొండి అని అన్నారు. నాణ్యతలోపంతో కాంట్రాక్ట్ లు చేసి, ముఖ్యమంత్రి కేసీఅర్ ను అడ్డుపెట్టుకొని మీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి వందల కోట్ల రూపాయలు సంపాదించి అనుభవిస్తున్నాడని, అది కేసీఅర్ దయవల్లే అని గుర్తుంచుకోవాలని ఆమె మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News