Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల

Khammam: ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల

ఇలాంటి పరిస్థితి దాపురించడం దురదృష్టం

స్థానిక 14,15 డివిజన్ల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి వర్యులు, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.
ఈ సందర్భంగా ఘనమైన స్వాగతం చెప్పినందుకు కృతజ్ఞతలు చెపుతూ మాట్లాడుతూ ప్రస్తుతం ఖమ్మం నగరంలో మనషులకు రక్షణ లేదు వారి ఆస్తులకు రక్షణ లేని దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి, ఖాళీ ప్లాటు కనబడితే కబ్జా చేసే నికృష్టమైన పరిస్థితుల నెలకొన్నాయని, ఎదురు తిరిగితే పోలీసు కేసులు పెట్టి వేధించడం, మాట వినని వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడం నిత్య కృత్యంగా మారిందని, ఖమ్మం నగరానికి ఇలాంటి పరిస్థితి దాపురించడం దురదృష్టకరమని అన్నారు..
గతంలో నేను మంత్రిగా వున్నపుడు ఖమ్మం నుండి ఆల్లిపురం వరకు డబుల్ రోడ్డు వేయించానని, ఇండ్లు లేని నిరుపేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇచ్చానని, స్కూల్ భవనంతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా నా హయాంలోనే జరిగిందని, భవిష్యత్తులో ఖమ్మం నుండి ఆల్లీపురం వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావేద్, సాధు రమేష్ రెడ్డి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రావూరి కరుణా సైదుబాబు, మేకల మల్లిబాబు, శెట్టి రంగారావు, పొదిలి రవి కుమార్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యనిగండ్ల సత్యనారాయణ, చేతుల నాగేశ్వరరావు, వడ్డిపూడి మల్లేశ్వరరావు, బొమ్మిషెట్టి సత్యనారాయణ, పిల్లికల్ల శ్రీనివాసరావు, జంగాల నాగేశ్వరరావు, మూడు ముంతల గంగరాజు, ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News