Saturday, November 15, 2025
HomeతెలంగాణHyderabad:ఖాజానా దొంగలు దొరికారు..20 రోజులు కాపు కాసి దోపిడి

Hyderabad:ఖాజానా దొంగలు దొరికారు..20 రోజులు కాపు కాసి దోపిడి

Khazana-Chandanagar: హైదరాబాద్‌ నగరంలో ఇటీవల సంచలనం రేపిన చందానగర్‌ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు పోలీసులు గుట్టు విప్పారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి తుపాకులు, బులెట్లు, దోచుకున్న వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

- Advertisement -

ఖజానా జ్యువెలరీలో…

ఆగస్టు 12న చందానగర్‌లోని ప్రసిద్ధ ఖజానా జ్యువెలరీలో ఈ దోపిడీ జరిగింది. సాయంత్రం కావడంతో షాప్‌లో రద్దీ ఉండగా, నిందితులు బైకులపై చేరుకుని లోపలికి దూసుకెళ్లారు. తుపాకులు చూపించి భయపెట్టి వెండి ఆభరణాలను లాక్కుని మళ్లీ బైకులపైనే అక్కడి నుంచి తప్పించుకున్నారు. మొత్తం 10 కిలోల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను వారు దోచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

20 రోజుల పాటు..

దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు దోపిడీకి ముందే ఈ ప్రాంతంపై దృష్టి సారించి, దాదాపు 20 రోజులపాటు షాప్ చుట్టుపక్కల తిరుగుతూ రెక్కీ చేసినట్లు గుర్తించారు. షాప్‌లో వచ్చే వారు, వెళ్లే వారు, భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల స్థానాలు అన్నింటిని గమనించిన తర్వాతే వారు దాడికి దిగారని అధికారులు వివరించారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/students-aadhaar-update-in-schools-telangana-education-department/

ఈ దోపిడీలో మొత్తం ఏడు మంది నిందితులు పాల్గొన్నారు. వీరంతా బిహార్‌కు చెందినవారని, గతంలో కోల్‌కతా, బిహార్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి దోపిడీలకు పాల్పడినట్లు దర్యాప్తులో బయటపడింది. హైదరాబాద్‌లోకి వచ్చి, ఇక్కడ చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తూనే, సరైన అవకాశం కోసం వేచి ఉన్నారని పోలీసులు తెలిపారు.

బంగారం పూత పూసిన..

దోపిడీ తర్వాత వాళ్లు బంగారాన్ని దొంగిలించామని అనుకున్నా, వాస్తవానికి షాప్‌లో ఉన్న బంగారం పూత పూసిన వెండి ఆభరణాలనే తీసుకెళ్లారని తేలింది. అంటే దాదాపు 10 కిలోల వెండి వస్తువులు మాత్రమే వారి చేతికి చిక్కాయి. ఇది కూడా పోలీసులు సత్వరమే కేసును ఛేదించడానికి ఒక కారణమైంది.

ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/revanth-reddy-praises-chandrababu-hyderabad-global-recognition/

నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు, 12 బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా తయారు చేసిన ఈ తుపాకులను ఉపయోగించి షాప్ సిబ్బందిని భయపెట్టారని తెలిసింది. అదేవిధంగా, దోపిడీ సమయంలో వాడిన బైకులను కూడా పోలీసులు పట్టుకున్నారు.

డీసీపీ వినీత్‌ మాట్లాడుతూ, ఈ బిహార్‌ ముఠా హైదరాబాద్‌లో ఇది మొదటి దోపిడీ అని స్పష్టం చేశారు. అయితే గతంలో వారు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దోపిడీలు జరిపారని వివరించారు. హైదరాబాద్‌లో వారు రెండు సంవత్సరాలుగా స్థిరపడినట్లు, ఈ సమయంలో కార్మికుల్లా పనిచేస్తూ, బయటకు ఏ అనుమానం రాకుండా మెలిగారని చెప్పారు.

పోలీసులు కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ, స్థానికుల సమాచారం, టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా ముందుకు సాగారు. దాంతో నిందితుల కదలికలను గుర్తించి, చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కేసు ఛేదనలో చందానగర్‌ పోలీస్‌ బృందం, టాస్క్‌ఫోర్స్‌ జట్లు కీలకపాత్ర పోషించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad