Friday, September 20, 2024
HomeతెలంగాణKolanu Hanumanth Reddy: ఊపందుకున్న కొలను ప్రచారం

Kolanu Hanumanth Reddy: ఊపందుకున్న కొలను ప్రచారం

కుతుబుల్లాపూర్ ఓటరు మనసులో ఎవరున్నారు?

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, పేదవాడు ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తామన్న మూడు లక్షల రూపాయలు, అందించడంలో వైఫల్యం చెందినందుకు గాజుల రామారం డివిజన్ పరిధిలోని, కైసర్ నగర్ లో, బిఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 150 మంది, రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు,పెద్దలు కె.యం.ప్రతాప్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి, కొలను హనుమంత్ రెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -


కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు సయ్యద్ తహర్, సుల్తాన్, హైమద్, సయ్యద్ అమీర్, ఎండి జరీన్, షేక్ జమీర్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కె.పి.విశాల్ గౌడ్ గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ లోకి అరుణ గౌడ్..

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఐడిపిఎల్ గూడెంమెట్ ప్రాంతం చెందిన స్వర్గీయ టిడిపి లీడర్ సత్యనారాయణ గౌడ్ సతీమణి అరుణ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. తన భర్త సత్యనారాయణ 30 ఏళ్లపాటు స్థానికులకు అండగా నిలిచి సేవ చేశారని ఆమె గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News