Saturday, October 5, 2024
HomeతెలంగాణKolparam: పరామర్శలు గ్రూపు రాజకీయాలు

Kolparam: పరామర్శలు గ్రూపు రాజకీయాలు

పార్టీ బలంగా ఉంది, కానీ లీడర్ల తీరుతో అయోమయంలో క్యాడర్

కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గంలో నాయకులు తలోదారి లో పరామర్శలు జరుపుతుండడంతో కార్యకర్తలు గందరగోళ పరిస్థితి నెలకొంది. పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఒకవైపు, పిసిసి సభ్యులు సోమన్న గారి రవీందర్ రెడ్డి వర్గం ఒకవైపు పరామర్శ చేస్తూ సందడి చేస్తున్నారు రవీందర్ రెడ్డి. అన్ని వర్గాలను కలుపుకొని పోతుండగా రాజిరెడ్డి మాత్రం ప్రత్యేకంగా ఒక వర్గాన్ని పెంచి పోషిస్తున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలంలో వై కేక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అయిన పైతర సర్పంచ్ సంతోషా అల్లేశంకు రాజిరెడ్డి పర్యటన వివరాలు తెలపకపోవడం గమనార్ధం. ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి అనిల్ కు సైతం రాజిరెడ్డి పర్యటన వివరాలు తెలుపలేదు రవీందర్ రెడ్డి వర్గం రాజిరెడ్డి పర్యటనకు దూరంగా ఉన్నారు. రవీందర్ రెడ్డి అన్ని వర్గాలను కలుపుకొని పోతుండగా రాజిరెడ్డి ప్రత్యేకంగా తనకంటూ ఒక వర్గంను మండలంలో పెంచి పోషిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు గ్రూపులను ప్రోత్సహిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నర్సాపూర్ నియోజకవర్గంలో నాయకుల తీరు వల్ల కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు ఆవుల రాజిరెడ్డి పై గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెల్దుర్తి మండలం లో గెలిచిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను అధికార టిఆర్ఎస్ పార్టీకి అప్పజెప్పి ఎంపీపీ టిఆర్ఎస్ అభ్యర్థికి దక్కేల అమ్ముడుపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి అలాంటి వ్యక్తికి పార్టీలో కార్యతీసి కార్యదర్శిగా ఇలా నియమించారంటూ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News