Friday, September 20, 2024
HomeతెలంగాణKomuravelli: అగ్నిగుండాల వద్ద ప్రత్యేక బందోబస్తు

Komuravelli: అగ్నిగుండాల వద్ద ప్రత్యేక బందోబస్తు

చివరి ఆదివారం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు పలువురు జిల్లా ప్రముఖులు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆదేశానుసారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల తొమ్మిదవ ఆదివారం (అగ్నిగుండాల) సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి అడ్మిన్ ఎస్. మహేందర్ పార్కింగ్ ప్రదేశాలను, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం,సాధారణ దర్శన ప్రదేశాలను, టెంపుల్ ఆవరణను పరిశీలించారు. అధికారులకు, సిబ్బందిని బందోబస్తు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి తగు సూచనలు చేశారు.
దర్శనానికి వచ్చే భక్తులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటిస్తూ మల్లికార్జున స్వామిని ప్రశాంతంగా దర్శించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. దర్శనం సజావుగా జరిగేటట్టు పోలీసు వారు తగిన బందోబస్తు నిర్వహించేలా చేశారు. అగ్నిగుండాలు నిర్వహించే ప్రదేశంలో బందోబస్తును పర్యవేక్షించి వారికి తగిన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసిపి సతీష్, చేర్యాల సీఐ సత్యనారాయణ రెడ్డి, తోగుట సిఐ కమలాకర్, కొమురవెల్లి ఎస్ఐ చంద్రమోహన్, భూంపల్లి ఎస్సై గంగరాజు, పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News