Saturday, October 5, 2024
HomeతెలంగాణKonaraopeta: ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవలు

Konaraopeta: ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవలు

డాక్టర్ చెన్నమనేని వికాస్, దీప దంపతులు

ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విస్తృతమైన సేవలు అందిస్తామని బిజెపి నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు, దీప దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. పార్టీలకతీతంగా గ్రామాలలో స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండు ఎల్లవ్వ ఆయిలయ్య, ఉప సర్పంచ్ రాములు, బిజెపి నాయకులు గోపాడి సురేందర్ రావు, గొట్టే రామచంద్రం, మిరియాల పురుషోత్తం రావు, జవాజీ తిరుపతి, ముష్ణం శ్రీనివాస్, బొల్లారం తిరుపతి, దుర్గం తిరుపతి, గ్రామ పాలకవర్గం మహిళా సంఘం సభ్యులు ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News