Friday, September 20, 2024
HomeతెలంగాణKondapur: కెసిఆర్ ప్రభుత్వానికి అపూర్వ స్పందన

Kondapur: కెసిఆర్ ప్రభుత్వానికి అపూర్వ స్పందన

కొండాపూర్ కార్పోరేటర్ షేక్ హమీద్ పటేల్

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వానికి అపూర్వ స్పందన లభిస్తుందని కొండాపూర్ కార్పోరేటర్ షేక్ హమీద్ పటేల్ ప్రతిస్పందించారు. కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన ప్రజాభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హమీద్ పటేల్ శనివారం నాడు మాదాపూర్ లోని అనేక కాలనీలు బస్తీలలో పాదయాత్ర చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

మాదాపూర్ లోని మాదాపూర్ కమిటీ హాల్, కుమ్మరి బస్తి, లంబడి తండా, వినాయక నగర్, సిలికాన్ వ్యాలీ, పత్రికానగర్లలో పర్యటించి అభివృద్ధి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. భారత రాష్ట్ర సమితి రాష్ట్రంలోని అనేక మెజారిటీ ప్రాంతాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పారు. శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈసారి మంత్రిని చేస్తామని షేక్ హమీద్ పటేల్ తన భరోసాను వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనదని, ప్రజలందరూ తమ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెరిక రమేష్ పటేల్, శ్రవణ్ కుమార్, రవి గౌడ్, సురేష్ యాదవ్, రూప రెడ్డి, గౌరీ, బాలరాజ్ యాదవ్ తదితరులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News