Thursday, April 10, 2025
HomeతెలంగాణKoppula: తెలంగాణ సర్కారుపై విమర్శలు చేసేందుకే మోడీ పర్యటన

Koppula: తెలంగాణ సర్కారుపై విమర్శలు చేసేందుకే మోడీ పర్యటన

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనతో ఒరిగింది ఏమి లేదని, కేవలం తెలంగాణ సర్కారుపై విమర్శలు గుప్పించేందుకే మోడీ హైదరాబాద్ వచ్చినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.  అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పిన మోడీ అవినీతి పరులను వెంటేసుకొని పర్యటించారని కొప్పుల ఆరోపించారు. కుటుంబ పాలన పై మోడీ కి మాట్లాడే అర్హత లేదన్న మంత్రి, తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ కుటుంబమన్నారు.  బీఆరెస్, కేసీఆర్ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుంటే తట్టుకోలేక పోతున్నారన్నారు. 

- Advertisement -

బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించిన కొప్పుల, సీఎం కేసీఆర్ ను విమర్శించే అర్హత  బండికి లేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాన్ని పార్టీ సభగా మార్చేశారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News