Thursday, September 19, 2024
HomeతెలంగాణKrishna Rao: దశాబ్ది ఉత్సవాలపై భేటీ

Krishna Rao: దశాబ్ది ఉత్సవాలపై భేటీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు… ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అవతరించి దశాబ్ద కాలం అయినందున ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు రాష్ట్ర అవతరణ నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ప్రతి ఒక్కరికి వివరించేలా నియోజకవర్గాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు.. గ్రూప్ మీటింగ్స్-సమావేశాలు, కళాకారుల ఆటపాటలతో వివరించేలా ప్రణాళికలు రచించాలని నిర్ణయించారు.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళుతుందని.. మహిళా, రైతు ,పారిశ్రామిక విద్యుత్, రోడ్లు, సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా నాయకులన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News