Sunday, June 22, 2025
HomeతెలంగాణKRMB Meeting: ఈనెల 27న కేఆర్ఎంబీ సమావేశం

KRMB Meeting: ఈనెల 27న కేఆర్ఎంబీ సమావేశం

KRMB Meeting: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ బోర్డు ఇరు రాష్ట్రాల అవసరాలకు కృష్ణా నదీలో ఎంత మేర నీటిని వాడుకోవాలో నిర్ణయిస్తుంది. సీజన్లు బట్టి ఈ బోర్డు ఇరు రాష్ట్రాల అధికారులతో సమాశం అవుతూ ఉంటుంది. తాజాగా ఖరీఫ్ సీజన్ దృష్ట్యా ఈనెల 27న కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.

ఈ మేరకు తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. 27వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని జలసౌధలో భేటీ జరుగుతుందని కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కేఆర్‌ఎంబీకి 20వ ప్రత్యేక సమావేశం కావడం గమనార్హం.

ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్ అవసరాల నిమిత్తం ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగునీటి అవసరాలకు పోను సాగునీటికి ఎంత కేటాయించాలనే అంశాలపై అధికారులు చర్చించనున్నారు. అలాగే తమ రాష్ట్రాల అవసరాలు, డిమాండ్లను అధికారులు బోర్దు ముందు ఉంచనున్నారు.

ఇక ఉద్యోగులకు చెల్లించిన ఇన్సెంటివ్స్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా చర్చించనున్నారు. ఇన్సెంటివ్‌ క్యాన్సిల్ చేయడం, రికవరీ చేయాలని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు గతంలో హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో బోర్డు నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుబట్టి ఆదేశాలు నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పుపై చర్చలు జరపనున్నారు. అనంతరం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రాజెక్టులలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని బోర్డు సూచించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News