Friday, September 20, 2024
HomeతెలంగాణKS Ratnam: దేశానికి మోడీ పాలన శ్రీరామ్ రక్ష

KS Ratnam: దేశానికి మోడీ పాలన శ్రీరామ్ రక్ష

చేవెళ్ళ బిజెపి అభ్యర్థి కే.ఎస్ రత్నం

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి పార్టీచేవెళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేవెళ్ళ మండలం మడికట్టు గ్రామంలో స్థానిక బిజెపి నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశానికి నరేంద్ర మోడీ పాలన శ్రీరామరక్ష అని మోడీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. దేశ రక్షణ ప్రజల భద్రత విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శం అన్నారు. శత్రు దేశాలు దేశ ఆర్థిక వ్యవస్థ ను దెబ్బ తీయడానికి నకిలీ నోట్ల ముద్రించి ఆర్థిక దోపిడికి పాల్పడుతున్నారు అన్న విషయం పసిగట్టి నోట్ల రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను కాపాడిన ఘనత కేవలం మోడీదే అన్నారు. దేశభద్రతకు పట్టం కట్టే పార్టీలను ప్రజలు ఆదరిస్తారని దేశానికి మూడోసారి మోడీ ప్రధాని అవుతారన్నారు. దేశానికి శ్రీరామ రక్షలాంటి పార్టీ చేవెళ్ల శాసనసభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను నియమించింది అన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News