Friday, October 18, 2024
Homeతెలంగాణకామారెడ్డిలో KTR ప్రచారం

కామారెడ్డిలో KTR ప్రచారం

ఢిల్లీ వెళ్లి తెల్చుకునే కాంగ్రెస్ పార్టీ, బిజెపిలు మనకెందుకు

కెసిఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారనగానే ప్రతిపక్షాలు నీరుగారిపోయాయని కేటీఆర్ అన్నారు. పోటీ చేసేందుకు వెనుకాడూతూ పారిపోయే ప్రయత్నం చేస్తున్నాయని, మొదటి రోజు నుంచి తెలంగాణ ఉద్యమ జెండా ఎగిరిన గడ్డ కామారెడ్డి అన్నారు. అందుకే ఇయాల కామారెడ్డిలో కేసీఆర్ పోటీతో ప్రతిపక్షాల పరిస్థితి పోచమ్మ గుడి ముందు గొర్రె పొట్టేలును కట్టేసినట్లు తయారయిందన్నారు.

- Advertisement -

ఇవాళ కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గం అవుతుందని కామారెడ్డి ప్రజలు నమ్ముతున్నారని, ఇంకా కామారెడ్డిలో అఖండ మెజార్టీతో కెసిఆర్ విజయం ఖాయమన్నారు. గంప గోవర్ధన్ స్వయంగా కేసీఆర్ గారిని పోటీ చేయాలని కోరిన నేపథ్యంలో కెసిఆర్ ని కామారెడ్డిలో పోటీ చేస్తున్నారన్నారు.

రానున్న తొమ్మిది నెలల కాలంలోనే కామారెడ్డికి గోదావరి జిల్లాలు వస్తాయి, మద్దిమల్ల నుంచి మచరెడ్డి కి నీళ్ళు రావాలి… 6-9 నెలల్లో నీళ్ళు తెచ్చి మీ కాళ్ళు కడుగుతామన్నారు. జల్ జంగల్ జమీన్ అన్న ఇవాళ నినాదాన్ని అర్థమంతంగా అమలులో చూపిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం, కొడంగల్ లోనే ఓడిపోయి పారిపోయిన రేవంత్ రెడ్డి, కామారెడ్డికి వచ్చి గెలుస్తానని అంటున్నాడన్నారు.

కొడంగల్ లో మా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పైనే గెలవలేని రేవంత్ రెడ్డి, కేసిఆర్ పై పోటీ చేస్తారని బీరాలు పలుకుతుండన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే డిపాజిట్ గల్లంతు చేసి ఉద్యమ వేడి చూపిస్తాం. బలిసిన కోడి చికెన్ సెంటర్ ముందుకొచ్చి తొడగొట్టినట్టు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉంది.

11 సార్లు అవకాశం ఇచ్చిన ఏం చేయలేని కాంగ్రెస్ పార్టీ… మరొక్కసారి అవకాశం అడుగుతుంది. ప్రతిదానికీ ఢిల్లీ వెళ్లి తెల్చుకునే కాంగ్రెస్ పార్టీ, బిజెపిలు మనకెందుకు. గతంలో రైతులు వ్యవసాయానికి, కరెంట్ కోతలతో కష్టాలు పడింది మర్చిపోవద్దన్నారు. అందరికీ మనం ఒక్కసారి కాంగ్రెస్ చీకటి రోజులు రావన్న, రైతులు అర్ధరాత్రి బోర్ల దగ్గర పండుకునే పరిస్థితి రావాల్నా ఆలోచించాలి. దేశంలో ఎక్కడన్నా 24 గంటల కరెంట్ సప్లై ఉందా. కర్ణాటకలో మాకు ఓటేసిన పాపానికి రైతులకు కేవలం 5 గంటల కరెంటు ఇస్తున్నామని అక్కడి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ చెప్పి పోయిండు.

కేసీఆర్ గతంలో రేవంత్ రెడ్డి కూడా మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతుంది అని చెప్పిండు. కాంగ్రెస్ మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు ఇస్తున్న రైతుబంధు దుబారా అంటుండు. కాంగ్రెస్ పాలన వస్తే కరెంటు కట్, రైతుబంధు కట్, ఎరువులు కట్, నీళ్లు కట్ అవుతాయి. మూడోసారి గెలిచిన తర్వాత కేసీఆర్ భరోసా కింద ఐదువేల వరకు వృద్ధాప్య పెన్షన్లు పెంచుకుంటూ పోతాం. నెలకు 3,000 రూపాయల చొప్పున అర్హులైన ప్రతి ఆడబిడ్డకు అందిస్తాం. అన్నపూర్ణ కింద తెల్ల రేషన్ కార్డ్ వాళ్ళకి సన్నబియ్యం ఇస్తాం.

ప్రతి ఇంటికి కేసీఆర్ బీమా అందిస్తాం. రానున్న 30 రోజులపాటు భారత రాష్ట్ర సమితి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పార్టీని ఘనంగా గెలిపించుకోవాలి. ఎవరి గ్రామాల్లో వారు పార్టీ పథకాలను ప్రభుత్వం సాధించిన ప్రగతిని, భవిష్యత్తులో అందించే సంక్షేమ కార్యక్రమాలను, ప్రతి ఒక్కరికి తెలిపి మెజార్టీ తీసుకువచ్చేలా చూడాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News