Friday, September 20, 2024
HomeతెలంగాణKTR: హెలిక్యాప్టర్ లో కేటీఆర్ బిజీ పర్యటనలు

KTR: హెలిక్యాప్టర్ లో కేటీఆర్ బిజీ పర్యటనలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో టూర్ కొట్టారు మంత్రి కేటీఆర్. జయశంకర్ భూపాల పల్లి జిల్లా ములుగు ఘనపురంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, వరంగల్ zp చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ములుగు జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు.
అనంతరం మంత్రి కేటీఆర్ ములుగు ఘనపురంలో మండల తహశీల్దార్ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. జ్యోతిరావు ఫూలే బాలికల ఆవాస పాఠశాలకు, సింగరేణి వెయ్యి క్వార్టర్స్ కి ప్రారంభోత్సవం చేశారు. ఆతరువాత భూపాలపల్లి లో అర్ అండ్ బీ అతిథి గృహానికి, దివ్యాంగుల కమ్యూనిటీ హాలుకు, డబుల్ బెడ్ రూం ఇండ్ల కు ప్రారంభోత్సవం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News