Friday, September 20, 2024
HomeతెలంగాణKTR: నిమ్స్ లో ఖమ్మం ప్రమాద బాధితులకు కేటీఆర్ పరామర్శ

KTR: నిమ్స్ లో ఖమ్మం ప్రమాద బాధితులకు కేటీఆర్ పరామర్శ

నిన్నచీమలపాడులో గాయపడ్డ ప్రమాద బాధితులను బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరామర్శించారు. ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులు ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స తీసుకుంటుండగా కేటీఆర్ తో పాటు మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని వైద్యులకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News