Tuesday, February 11, 2025
HomeతెలంగాణKTR: అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్

KTR: అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్

చిలుకూరు బాలాజీ(Chilukur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంటిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) రంగరాజన్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అర్చకులు రంగరాజన్‌పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి ఈ దాడి సంఘటన నిలువెత్తు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారు ఏ ముసుగులో ఉన్నా వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. భగవంతుని సేవలో నిమగ్నమైన రంగరాజన్ కుటుంబ సభ్యులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

చిలుకూరు బాలాజీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఉన్నారని, స్వామివారి సేవలో నిమగ్నమైన కుటుంబాన్ని అవమానించడం అంటే అది దేవుడినే అవమానించినట్టేనని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News