Sunday, October 6, 2024
HomeతెలంగాణKukatpally: ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించండి

Kukatpally: ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించండి

కూకట్పల్లి నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమ్మేళన సభా కార్యక్రమం కెపిహెచ్బి లోని కమ్యూనిటీ హాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో సాగింది. నియోజకవర్గ పరిశీలకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీలు నవీన్ కుమార్. శంబిపూర్ రాజు, నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

బిఆర్ఎస్ సైనికులు అందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలని ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందీ వివరించాలన్నారు ఎమ్మెల్యే మాధవరం.  ఇదే వేదికపై బాలానగర్, కెపిహెచ్బీ డివిజన్ కు చెందిన 200 మంది బిజెపి, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News