Sunday, October 6, 2024
HomeతెలంగాణKukatpally: శంకుస్థాపనలు చేసిన పనులన్నీ తక్షణం పూర్తవ్వాలి: మాధవరం

Kukatpally: శంకుస్థాపనలు చేసిన పనులన్నీ తక్షణం పూర్తవ్వాలి: మాధవరం

ఈ మధ్యకాలంలో శంకుస్థాపన నిర్వహించిన పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలని.. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు..కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. డ్రైనేజీ వ్యవస్థ నిర్మించే చోట రోడ్డు తవ్వి తిరిగి రోడ్డు పునరుద్ధరణ పనులు త్వరితగతిని పూర్తిచేయాలని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు మాధవరం. సమస్యలుంటే తెలియచేయాలని అంతేకానీ అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన ఘాటుగా హెచ్చరించారు. నియోజకవర్గంలో దాదాపు 90% పనులు పూర్తి చేశామని ఇంకా ఎక్కడైనా అరకొర పనులుంటే వెంటనే పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. మూసాపేట్ లోని మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ మమతతో కలిసి అన్ని విభాగాల అధికారులతో కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News