Tuesday, September 17, 2024
HomeతెలంగాణKukatpally: పోచమ్మ తల్లికి శోభాయాత్ర

Kukatpally: పోచమ్మ తల్లికి శోభాయాత్ర

పోచమ్మ తల్లి ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా అమ్మవారి శోభాయాత్ర చిత్తారమ్మ దేవాలయం నుండి బ్రహ్మాండంగా సాగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లి గ్రామం ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో పాడిపంటలతో కళకళలాడుతూ ఉండేదని అతి పురాతనమైన కూకట్పల్లిలోని అన్ని దేవాలయాలను పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించడమే లక్ష్యంగా అందులో తాను కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. 16వ తేదీన జరిగే పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కోలాట విన్యాసాలు ఊరేగింపు ఆకట్టుకున్నాయి. అమ్మవారి శోభాయాత్రలో ముస్లిం సోదరులు మజ్జిగ పంచి మనమందరం ఒక్కటే అన్న భావం అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News