Tuesday, September 17, 2024
HomeతెలంగాణMachareddy Mandal: తండాల్లో గుగులోతు శంకర్ నాయక్ ప్రచారం

Machareddy Mandal: తండాల్లో గుగులోతు శంకర్ నాయక్ ప్రచారం

కామారెడ్డిలో విస్తృతంగా ప్రచారం

మాచారెడ్డి మండల్ గజ్జ నాయక్ తండ, బంజారా తండా, ఘన్పూర్ తండా , సోమరి తండా, నడిమి తండా, మైసమ్మ చెరువు తండా ,తడకపల్లి తండా, సున్నం గట్ల తండా, రామారెడ్డి మండలం జగదంబ తండా, స్కూల్ తండా, బట్టు తాండ, గుడ్ కంపూర్ తండాలో కామారెడ్డి రూరల్ సద్ది పూర్ తండా, రమేష్ పల్లి తండా, భవాని తండా, క్యాసంపల్లి తండా, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్దతుగా గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర మాజీ సమాచార కమిషనర్ డా. గుగులోతు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మండల స్థాయి మీడియా సమావేశం నిర్వహించారు.

- Advertisement -

వివిధ గ్రామాల్లో తండాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ, గ్రామాల్లో తండాల్లో అందరితో మాట్లాడుతూ కేసీఆర్ చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ, కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనులకు స్వర్ణయగం, గిరిజనుల అన్ని రంగాల్లో అభివృద్ధిలో చెందారన్నారు.

కెసిఆర్ హయాంలో 500 జనాభా ఉన్న తండాలం గ్రామ పంచాయతీ, ఎస్టీ రిజర్వేషన్, కళ్యాణ లక్ష్మి పథకం, రైతుబంధు పథకం, కెసిఆర్ కిట్టు, గురుకులాలు, విదేశీ విద్యా పథకం, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా గిరిజనులు అభివృద్ధికి నోచుకునేలా చేశారన్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో గిరిజన లంబాడీలు కెసిఆర్ కారు గుర్తుకు ఓటేయాలన్నారు. గిరిజనులు, బంజారాలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. భారీ మెజార్టీతో కేసీఆర్ గెలుపు కోసం కృషి చేయాలని శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి మురళీకృష్ణ బి సురేష్ నాయ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News