Tuesday, July 2, 2024
HomeతెలంగాణMadan reddy: జైన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి

Madan reddy: జైన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి

ఏ పని చేసినా కొల్చారం లోని జైన దేవాలయాన్ని దర్శించుకోవడం తన అలవాటని, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం పార్శ్వనాథ స్వామి అన్నారు

కొల్చారం మండల కేంద్రమైన కొల్చారం జైన దేవాలయంలో 23వ తీర్థంకరుడు పార్ష్యనాథ స్వామిని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. అలాగే పార్శ్వనాథ స్వామికి ఎమ్మెల్యే అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ ఏ పని చేసినా కొల్చారం లోని జైన దేవాలయాన్ని దర్శించుకోవడం తన అలవాటని, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం పార్శ్వనాథ స్వామి అన్నారు. ఇక్కడ దర్శించుకుంటే ఎంతటి పనులైనా సునాయాసంగా జరుగుతాయన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు కాలేశ్వరం నీళ్లు అందించాలన్నదే తన కోరిక అన్నారు. కొల్చారం కు మళ్లీనాథసూరి సంస్కృత విశ్వవిద్యాలయం మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ ను కలిసి జ్ఞాపక అందజేసి కృతజ్ఞతలు తెలుపుతానన్నారు. ఎమ్మెల్యే వెంట ఆలయ కమిటీ చైర్మన్ సుమీర్ చంద్ పాండ్యా, కొల్చారం సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కరెంటు రాజా గౌడ్, రైతు సమితి కో ఆర్డినేటర్ గ్యాస్ కృష్ణ, కారోబార్ వడ్ల ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News