Saturday, September 21, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: 40వ రోజుకు చేరిన కృష్ణారావు పాదయాత్ర

Madhavaram Krishna Rao: 40వ రోజుకు చేరిన కృష్ణారావు పాదయాత్ర

కె.పి.హెచ్.బి కాలనీలో పాదయాత్ర

కూకట్‌పల్లి నియోజికవర్గంలోని కే.పి.హెచ్.బి డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకోవటం కోసం స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేపట్టిన పాదయాత్ర 40వ రోజుకు చేరుకుంది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పాదయాత్ర చేస్తూ నేడు కె.పి.హెచ్.బి కాలనీలో పాదయాత్ర చేపట్టారు. స్థానిక ప్రజలు, మహిళలు మంగళ హారతులతో, పూలు చల్లుతూ స్వాగతం పలికారు.

- Advertisement -

ఎమ్మేల్యే సైతం ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ వారి వారి సమస్యలు అడిగి తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ సహకారంతో ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని అన్నారు.

పాదయాత్రలో స్థానికులు చిన్న చిన్న సమస్యలు తన దృష్టికి తీసుకొని రాగా వాటి పరిష్కారం కోసం కావాల్సిన చర్యలు తీసుకోనున్నామని అన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూంలు, గృహలక్ష్మి పథకాలను అందజేస్తున్నామని, రానున్న ఎన్నికలలో ప్రజలు తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News