Friday, October 4, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: ప్రజల కష్టాల 60 ఏళ్లైనా పట్టని కాంగ్రెస్

Madhavaram Krishna Rao: ప్రజల కష్టాల 60 ఏళ్లైనా పట్టని కాంగ్రెస్

డిపాజిట్లు కూడా రాకుండా ఓడగొట్టండి

60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ బేగంపేట ప్రజల కష్టాలను పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన 9 సంవత్సరాలలో వర్షాల బారి నుండి కాపాడినామని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ప్రచారం రోజురోజుకు ఊపందుకుంటుంది. అందులో భాగంగానే బేగంపేట డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా డివిజన్లోని పలు కాలనీలను తిరుగుతుంటే మంగళ హారతులతో బతుకమ్మలతో బిఆర్ఎస్ పార్టీకి నీరజనాలు పలుకుతున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తాను గెలిచిన 9 సంవత్సరాలలో బేగంపేట ప్రజలకు ఇంటింటికి మంచినీళ్లు అందించమని అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు ఇండ్లలోకి నీళ్లు వచ్చి ఇండ్లు మునిగిపోయే పరిస్థితిలో ఉన్న బేగంపేటను రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేసి ఇండ్లలోకీ నీళ్లు రాకుండా కాపాడమన్నారు.

దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు బేగంపేట ప్రజలకు ఏమి చేయలేదని ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం అబ్బదాల ప్రచారం చేసి పబ్బం గడుపుకోనే పార్టీలని అలాంటి పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజలను కోరారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని వచ్చాక ఎన్నికల హామీలను నెరవేర్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News