Saturday, November 15, 2025
HomeతెలంగాణMadhavaram Krishna Rao: కేపీహెచ్బీలో ఎటుచూసినా అభివృద్ధే

Madhavaram Krishna Rao: కేపీహెచ్బీలో ఎటుచూసినా అభివృద్ధే

43వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే పాదయాత్ర

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కె.పి.హెచ్.బి కాలనీలోని చిల్డ్రన్స్ పార్కులను, మహిళా పార్కులను ఏర్పాటు చేశామని డివిజన్లోని మంచినీటి సమస్య లేకుండా చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం లోని కే.పి.హెచ్.బి కాలనీ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి 43వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేపట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని అందులో భాగంగానే కే.పి.హెచ్.బి డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు, మంచినీటి సమస్యతో పాటుగా మహిళల కోసం ప్రత్యేకమైన పార్కులను చిన్నపిల్లల కోసం చిల్డ్రన్స్ పార్కులను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు అందించి బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad