Thursday, September 19, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: నిరుపేద- కోటీశ్వరుడు వరకు ఆదుకునేది భాగ్యనగరం

Madhavaram Krishna Rao: నిరుపేద- కోటీశ్వరుడు వరకు ఆదుకునేది భాగ్యనగరం

నివాస యోగ్యంగా సకల సౌకర్యాలున్న సిటీ హైదరాబాద్

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ఆవులు రవీందర్ రెడ్డితో కలిసి బాలానగర్ డివిజన్లోని..2 కోట్ల 46 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు …ఇందులో భాగంగా ఇంద్రానగర్ లోని 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేయగా పలు సిసి రోడ్డు పనులు పనురుద్ధరణకు శంకుస్థాపనలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో భవిష్యత్తులో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూగర్భ నీటి పైప్లైన్.. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుచుకుంటూ వస్తున్నామని ..ఎక్కడైతే రోడ్లు మరమ్మత్తు పనులు జరిగినాయో తిరిగి పునరుద్ధరణ పనులు కూడా త్వరగా చేపడుతున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని… అన్ని వర్గాల ప్రజలకు హైదరాబాద్ మహానగరం నివాస యోగ్యంగా సకల సౌకర్యాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ప్రతినిత్యం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.. నేడు బస్తి నుంచి కార్పొరేట్ వ్యక్తులకు దిక్సూచిగా మన భాగ్యనగరం ఉందని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్.. నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News