Saturday, October 5, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: తనకే ఓటేయమని మాధవరం కృష్ణారావు ప్రచారం

Madhavaram Krishna Rao: తనకే ఓటేయమని మాధవరం కృష్ణారావు ప్రచారం

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో ..

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావుతో కలిసి బాలాజీ నగర్ డివిజన్ లోని వివిధ ప్రాంతాల్లో అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంజనేయ నగర్… బాలాజీ నగర్, కెపిహెచ్బి రోడ్ నెంబర్ 1..3.. లో ప్రజలతో మాట్లాడుతూ ఒకప్పుడు బాలాజీ నగర్ డివిజన్లో మంచినీళ్లు కొరతతో చాలా ఇబ్బంది పడే వారమని ఇప్పుడు 24 గంటలు విద్యుత్ మంచినీరు, సిసి రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో చేసి చూపించామని అన్నారు.

- Advertisement -

బాలాజీ నగర్ లో ఇంకా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇప్పటికే ప్రణాళిక బద్ధంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి వస్తున్నామని భవిష్యత్తులో నాళాలు సమస్య అనేది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

తాను పోటీ చేస్తున్న కూకట్పల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇప్పించి గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్.. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News