Thursday, September 19, 2024
HomeతెలంగాణMadhavaram Krishnarao: 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలోనే

Madhavaram Krishnarao: 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలోనే

ఇదే కేసీఆర్ గొప్పతనం

60 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని 9 సంవత్సరాలలో అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్, ఫతేనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, సబిహా గౌసుద్దీన్ తో కలిసి 9 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ప్రధానంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను, అదేవిధంగా భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రోడ్లు డ్రైనేజీలను మంత్రి కేటీఆర్ సహకారంతో 122 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. 60 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఆహ్లాదకరమైన పార్కులు వాకింగ్ ట్రాక్, రోడ్లు, డ్రైనేజీలు, వేసామని నియోజకవర్గంలో 90 శాతం పనులు పూర్తి చేశామని పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News