Wednesday, October 2, 2024
HomeతెలంగాణMadhavaram Krishnarao: పాదయాత్రలో సమస్యలకు సత్వర పరిష్కారం

Madhavaram Krishnarao: పాదయాత్రలో సమస్యలకు సత్వర పరిష్కారం

40 రోజులుగా పాదయాత్ర

కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇప్పటికే ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని.. ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటే పాదయాత్రలో తెలుస్తాయి అన్న ఉద్దేశంతో గత 40 రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను నేరుగా పరిష్కరిస్తూ వస్తున్నారు ..ఈ సందర్భంగా అక్కడక్కడ పెండింగ్లో ఉన్న రోడ్లకు శంకుస్థాపన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలానగర్ డివిజన్లోని 1 కోటి 95 లక్షల రూపాయలతో వివిధ సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా భూగర్భ పైప్లైన్ నిర్మాణాలు కూడా చేపడుతున్నామని.. అలాగే ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలైన మంచినీరు, రోడ్లు, విద్యుత్, పార్కులు వంటి సకల సౌకర్యాలతో ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.. నేడు హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ స్థాయిలో నిలబడుతుంది అంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషివల్లే అని.. భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గోదావరి.. కృష్ణా జలాలు తీసుకువచ్చి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీరుస్తున్న గొప్ప నాయకులని కొనియాడారు….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News