Sunday, October 6, 2024
HomeతెలంగాణMadhavaram Krishnarao: కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ సందర్శించిన ఎమ్మెల్యే

Madhavaram Krishnarao: కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ సందర్శించిన ఎమ్మెల్యే

కార్డు స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్ ధనలక్ష్మి సెంటర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న కార్డు స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో మరింత మందికి చేయూతనందించేందుకు ఖార్డు సంస్థ అధినేత సుమన్ ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.

- Advertisement -

ఈ తరగతులు ద్వారా శిక్షణ పొంది అనంతరం మంచి ఉన్నత స్థానంలోకి వెళ్లేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని.. వారు ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగంలో కానీ లేక స్వయంగా కానీ ఉపాధి మార్గం దొరికే విధంగా దీన్ని రూపొందించామన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ..ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు ..డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News