Saturday, October 5, 2024
HomeతెలంగాణMadhira: కాంగ్రెస్ పార్టీలో చేరిన పలు కుటుంబాలు

Madhira: కాంగ్రెస్ పార్టీలో చేరిన పలు కుటుంబాలు

కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం- మల్లు నందిని

కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల, పేదల అభివృద్ధి సాధ్యం అని మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని పేర్కొన్నారు. మధిర మండలం ఇల్లూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు గ్రామ సొసైటీ డైరెక్టర్ పత్తెపరపు సంగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నారై సైదులు, వార్డ్ మెంబర్ షేక్ కాసింబి,షేక్ హుస్సేన్, షేక్ మస్తాన్ బి, షేక్ హుస్సేన్ బి, షేక్ నాగు పటాన్, జాన్ పటాన్ సైదా మల్లు నందిని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శేట్టి కిషోర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్, రెడ్డి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా బాలరాజు, బీసీ సెల్ మండల అధ్యక్షులు చిలువేరు బుచ్చిరామయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్, మధిర మున్సిపల్ కౌన్సిలర్ కోనా ధని కుమార్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు దుంప వెంకటేశ్వర రెడ్డి, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు బాణావత్ రమణా నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మువ్వా వెంకయ్య బాబు, కర్నాటి రామారావు, రొంపి మల్ల సర్పంచ్ మదర్ సాహెబ్, ఐలూరి సత్యనారాయణ రెడ్డి, ఎస్ కే బాజీ,పగిడిపల్లి డేవిడ్, ఆదిమూలం శ్రీనివాస్, కోట నాగరాజు, బోల్లెద్దు రాజేందర్, కోట డేవిడ్, కోటా చంటి, కోటా ఏసురత్నం ,గారపాటి రామయ్య, కోట జమలయ్య, కోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News