Sunday, November 16, 2025
HomeతెలంగాణMadhusudan Reddy: కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కాలే యాదయ్యకు లేదు

Madhusudan Reddy: కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కాలే యాదయ్యకు లేదు

కాంగ్రెస్ టికెట్ పై గెలిచి, బీఆర్ఎస్ లో చేరిన ఆయనా మమ్మల్ని విమర్శించేది?

కాంగ్రెస్ కార్యకర్తలు వేసిన ఓట్లతో గెలిచి శాసన సభలోకి అడుగు పెట్టిన కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే కార్యకర్తలు చూస్తూ ఉరు కోరని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చేవెళ్లలో జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లిన యాదయ్యకు ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ లో పలు రకాల పదువులు అనుభవించి బీఆర్ఎస్ లో చేరటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన, చేవెళ్లలో ఎమ్మెల్యే యాదయ్య కుటుంబ పాలనను గద్దె దించేంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేస్తారన్నారు మధుసూదన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad