Thursday, September 19, 2024
HomeతెలంగాణMahabubabad: కాంగ్రెస్ లోకి బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్

Mahabubabad: కాంగ్రెస్ లోకి బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్

మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాజీ జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు‌, తెలంగాణ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్లంగి ప్రతాప్ ను టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముల్లంగి ప్రతాప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ పాలనలో సబ్బండ వర్గాల ప్రజల ఇబ్బందులు పడుతూ, యువతకు ఉద్యోగాలు రాక, రైతులు పండించిన పంటలు కొనక, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాక, ధరణి పేరిట భూ దందాలు చేస్తూ కేసీఆర్‌ కుటుంబానికి పదవులు ఇచ్చుకున్న కేసీఆర్‌ పాలనను అంతమొందించాలంటే ఆయన అవినీతి మీద నిరంతరం కొట్లాడుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, కేసీఆర్‌ ను గద్దె దించేందుకు తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తించి మన ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలన్నారు. , TPCC రాష్ట్ర అధ్యక్షులు మల్కాజ్ గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ అవినీతిని, ఆయన బానిసలను మట్టికరిపించేందుకు పూర్వ కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీ బి.ఆర్.ఎస్. బిజెపిలో చేరిన కాంగ్రెస్ నాయకులు తిరిగి రావాలని పిలుపునిచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందున సరైన గౌరవం కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆదివాసి వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నె శ్రీకాంత్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, బయ్యారం మండల PACS డైరెక్టర్ జూలకంటి సీతారాం రెడ్డి, TPCC⁩ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి అంబాల శివకుమార్ , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News