Monday, April 14, 2025
HomeతెలంగాణMahabubnagar: ఓటేసిన చల్లా దంపతులు

Mahabubnagar: ఓటేసిన చల్లా దంపతులు

ప్రత్యేక పూజలు చేసి..

మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించు కోవడం జరిగింది. ఉదయం మహబూబ్ నగర్ పట్టణ పరిధిలోని టిటి గుట్ట శ్రీశ్రీశ్రీ స్వయంభూ తిరుమలనాథ స్వామి దేవాలయంలో చల్లా వంశీచంద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం టీచర్స్ కాలనీలోని బూత్ నెం 113 బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ లో సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా చల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ…
మన దేశ రాజ్యాంగ పునాదుల పటిష్టత కోసం ప్రజలందరూ ఏకమై ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఓటరు పండుగలా భావించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అయన కోరారు. ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో కొనసాగే విధంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తున్న రాష్ట్ర సుపరిపాలనను ఆశీర్వదించేలా పాలమూరు ప్రజలు భాద్యతతో పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News