Sunday, July 7, 2024
HomeతెలంగాణMahipal Reddy: దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

Mahipal Reddy: దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు మరింత పెంపొందించడానికి నూతన దేవాలయాల నిర్మాణాలు చేపట్టడం సంతోషకరమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల పరిధిలోని శివనగర్ గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అయ్యప్ప స్వామి, సాయిబాబా దేవాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా నూతన దేవాలయాల నిర్మాణాలకు, పురాతన ఆలయాల పునరుద్ధరణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. సాయిబాబా, అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణాలకు సైతం తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ రేఖ కృష్ణ, ఎంపీటీసీ సంతోషి మహేష్, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గ్రామ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News