Saturday, October 5, 2024
HomeతెలంగాణMallapur: బీజేపీది ఎలక్షన్ యాత్ర

Mallapur: బీజేపీది ఎలక్షన్ యాత్ర

ఫోటోలకు పాలాభిషేకం

కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉండి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి పదేళ్లు గుర్తుకు రాని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ లోక్ సభ ఎన్నికలు సమిపిస్తుండటంతో ‘విజయ సంకల్ప యాత్ర’ పేరిట ఎన్నికల యాత్ర మొదలు పెట్టారని, యాత్ర పేరుతో ప్రజలను బీజేపీ మోసం చేస్తుందని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకిటి సత్యం రెడ్డి అన్నారు.

- Advertisement -


ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ సందర్శనకు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి రావటం పట్ల ముత్యంపేట షుగర్ ప్యాక్టరీ ముందు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కిసాన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫ్యాక్టరీల పునరుద్ధరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బిజెపి వైఖరి తెలిపి ఫ్యాక్టరీ సందర్శించాలని నిరసన చేశారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీల పునరుద్దరణ సిఫార్సుల కమిటీ వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చైర్మన్ గా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు, సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావులకు పాలాభిషేకం చేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు వాకిటి సత్యం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నా రెడ్డి, టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు దామెర రాజశేఖర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జి రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, మల్లపూర్ మండల ఫిషేర్మన్ అధ్యక్షులు రొడ్డ రాజు, మల్లపూర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజు, రేగుంట గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం భూమనందం, కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్, యండి జాఫర్, పల్లె శేఖర్, ఇప్పపెల్లి గణేష్, మొగిలి రాజేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News