Tuesday, October 22, 2024
HomeతెలంగాణMallapur: దళారులని నమ్మి రైతులు నష్టపోవద్దు

Mallapur: దళారులని నమ్మి రైతులు నష్టపోవద్దు

ప్యాక్స్ చైర్మన్ నర్సారెడ్డి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మల్లాపూర్ మండల కేంద్రంలో పాక్స్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మల్లాపూర్ మండల కేంద్రంలో సింగిల్ విండో ఛైర్మెన్ వెంపేట నర్సారెడ్డి కొబ్బరికాయ కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్యాక్స్ చైర్మన్ మాట్లాడుతూ దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్మి, మంచి రేటు పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పాలత నర్సయ్య, వైస్ చైర్మన్ ఇట్టేడి నారాయణ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ పుండ్ర లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మార్క్ ఫెడ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News