Sunday, October 6, 2024
HomeతెలంగాణMallapur: వరద బాధితులని ప్రభుత్వం ఆదుకోవాలి

Mallapur: వరద బాధితులని ప్రభుత్వం ఆదుకోవాలి

మొగిలిపేటలో పర్యటించిన సుజిత్

టిపిసిసి డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు తన స్వగ్రామమైన మొగిలిపేటలో పర్యటించారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొగిలిపేట నుండి మల్లపూర్ వెళ్లే రోడ్డు పెద్ద చెరువు, & మత్తడి గల ప్రాంతలలో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం పంచాయతీ రాజ్ ఏఈతో చెరువు దగ్గర మత్తడి గురించి మాట్లాడి వెంటనే మరమ్మతులు చేపట్టాలని టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు కోరారు.
వీరితోపాటు ఎన్నెడ్ల రాములు, గోల్కొండ రమేష్, గంధం రాజేందర్, మసుల చిన్నయ్య, మసుల బుచ్చిరెడ్డి, వరద సురేష్, సతీశ్, మిట్టపెళ్లి మహేశ్, బండపెల్లి నర్సయ్య, ఎద్దులపురం చిన్నరాజన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News