Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: మల్లాపూర్ మండల కేంద్రంలో జువ్వాడి పర్యటన

Mallapur: మల్లాపూర్ మండల కేంద్రంలో జువ్వాడి పర్యటన

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు మల్లాపూర్ మండల కేంద్రంలో పర్యటించారు. మండల కేంద్రంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలనీ పరిశీలించారు, కళాశాల సమస్యలని పరిష్కరించాలని అధ్యాపక బృందం కోరగా సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మాజి ఎంపీటీసీ సత్తమ్మ భర్త మల్లయ్య ప్రమాదవశాత్తు గాయపడగా పరామర్శించారు. తొందరగా కోలుకోవాలని , డాక్టర్ ల సలహాలు పాటించాలని సూచించారు.

- Advertisement -

మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ మేలు జరుగుతుందని, సిఎం రేవంత్ రెడ్డి పైన బిఆర్ యస్ నేతలు చేసే విమర్శలు అర్థరహితం అని, గతంలో పదవుల కోసం కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లోకి వెళ్లారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ముఖ్య మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, విపక్ష నాయకుల స్వార్థం కోసం ప్రజల మధ్య వైషమ్యాలు పెడుతున్నారని, ప్రజా ప్రభుత్వంలో అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అద్యక్షులు ఎలాల. జల్పతి రెడ్డి , మాజీ మండల అధ్యక్షులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News