Sunday, November 16, 2025
HomeతెలంగాణMallapur: రైతులను బేజారు చేయిస్తున్న మోటర్ల దొంగలు

Mallapur: రైతులను బేజారు చేయిస్తున్న మోటర్ల దొంగలు

మల్లాపూర్ లో దొంగలు పడ్డారు

గోదావరి తీరా ప్రాంతాన ఉన్న మోటార్లపై దొంగల కన్ను పడింది. మండలంలోని కొత్త దాం రాజ్ పల్లి, మొగిలిపేట్ గ్రామాల రైతులకు చెందిన మోటార్ల వైర్లను దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్షాకాలం ఆరంభం అవుతుండగా, పచ్చి రొట్టకు నీరు పెట్టేందుకు మోటార్లు ఆన్ చేసేందుకు రైతులు వెళ్లగా మోటార్లకు ఉన్న వైర్లు దొంగిలించడం చూసి అవాక్కయ్యారు. వైర్లలో ఉన్న కాపర్ వైర్ ని కరిగించి తీసుకెళ్లారని రైతులు చెబుతున్నారు. కొత్త ధాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన కాటిపల్లి ఆది రెడ్డి, క్యాతం రమేష్, నోముల రమేష్, సంతోష్, లింగారెడ్డి, నరేష్, శంకరమ్మ లకు చెందిన మోటార్ల వైర్ల దొంగతనం జరిగినట్టు, సుమారు నలభై వేల నష్టం వాటిల్లిందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, పోలీసు యంత్రాంగం దొంగలపై దృష్టి సారించలని పోలీసులను రైతులు వేడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad