Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: పాత దాం రాజుపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులకు వీడ్కోలు సన్మానం

Mallapur: పాత దాం రాజుపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులకు వీడ్కోలు సన్మానం

సర్పంచ్ &వార్డ్ సభ్యుల పదవి కాలం పూర్తి

సర్పంచ్ & వార్డ్ సభ్యుల పదవి కాలం పూర్తి అయ్యింది. ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి అవ్వడం తో పాత ధాంరాజ్ పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసారు.సర్పంచ్, ఉప సర్పంచ్,పంచాయతీ పాలకవర్గ సభ్యులను పాత దామరాజు పల్లి గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. పార్టీ లకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు సర్పంచ్, వార్డ్ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పాతదామరాజు పల్లి సర్పంచ్ మైదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదేళ్ల పదవి కాలంలో తనకు వెన్నంటే ఉన్న పంచాయతీ పాలకవర్గానికి, గ్రామ అభివృద్ధికి కృషి చేసిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకతీతంగా తాను గెలవడానికి కృషి చేసి, తనకు సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధిలో తనవంతు కృషి ఉంటుందని తెలిపారు. అనంతరం పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ, వీవోఏ లను సర్పంచ్ సన్మానించారు.ఇట్టి కార్యక్రమం లో ఎంపీటీసీ క్యాతం సుజాత నరేష్ రెడ్డి,ఉప సర్పంచ్ సంధ్య శ్రీకాంత్,కార్యదర్శి నరేష్, వార్డ్ సభ్యులు గణేష్, హన్మండ్లు, సుధాకర్, లక్ష్మి, మల్లవ్వ, పాక్స్ డైరెక్టర్ లు సుతారి రాజేందర్, కొత్తూరీ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నా రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు,మాజీ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News