Wednesday, September 18, 2024
HomeతెలంగాణMallapur: రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి

Mallapur: రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి

రెండవ విడత రుణమాఫీ పై రైతులు కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ పాతదామరాజుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి రైతుల పాలిట రేవంత్ రెడ్డి ఆపద్బాంధవుడు అయ్యాడని కాంగ్రెస్ నాయకులు రైతులు అన్నారు.

- Advertisement -

ప్రజా ప్రభుత్వంలో సబ్బండ వర్గాలకు న్యాయం కలుగుతుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్న తెలంగాణ ప్రభుత్వనికి రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలాల. జల్పతి రెడ్డి, కాంగ్రెస్ పార్టి మండల అధ్యక్షుడు కొమ్ముల. చిన్నా రెడ్డి,ప్యాక్స్ డైరెక్టర్ కొత్తూరి. నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షులు సామ. మోహన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగా రెడ్డి, నారాయణ, రాజ రెడ్డి,ఆనంద్, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News