Tuesday, September 17, 2024
HomeతెలంగాణMallapur: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే

Mallapur: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే

టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు

మండలంలోని ముత్యంపేట, సిర్పూర్, రేగుంట, వాల్గొండ, కొత్త ధాంరాజ్ పల్లి, పాత ధాంరాజ్ పల్లి, మొగిలిపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు శంకుస్థాపన చేసారు. సిసి రోడ్లు, డ్రైనేజి పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా సుజిత్ రావు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ అని, రాబోయే రోజుల్లో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని, రేవంత్ రెడ్డి నాయకత్వం లో రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతమని, రాబోయే ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నా రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకిటి. సత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దామెర రాజ శేఖర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రుత్త. నారాయణ, వైస్ ఎంపీపీ నగేష్, మొగిలిపేట ఎంపీటీసీ సత్తెమ్మ రాజ రెడ్డి వాల్గొండ ఎంపీటీసీ క్యాతం సుజాత నరేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సుధాకర్, రాజ శేఖర్, జాఫర్, రాం రెడ్డి,గణేష్, రమేష్, రాజ రెడ్డి, రాజేందర్ గోవర్ధన్, రాకేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News