Sunday, October 6, 2024
HomeతెలంగాణMaloth Kavitha met Railway minister: Delhi: జర్నలిస్టుల రైల్వే రాయితీలపై ...

Maloth Kavitha met Railway minister: Delhi: జర్నలిస్టుల రైల్వే రాయితీలపై చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి

TUWJ (IJU) విజ్ఞప్తికి స్పందించిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత

జర్నలిస్ట్ లకు రైల్వే ప్రయాణంలో లభించే రాయితీలను పునరుద్దరించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను MP మాలోత్ కవిత ప్రత్యేకంగా కలిసి కోరారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రైల్వే ప్రయాణంలో జర్నలిస్ట్ లకు లభించే రాయితీ కరోనా తర్వాత నిలిచిపోయిన అంశాన్ని డిల్లీలో ఉన్న కవిత దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన మాలోత్ కవిత రైల్వేమంత్రిని కలిసి, జర్నలిస్ట్ ల సమస్యను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తమ పక్షాన రైల్వే మంత్రిని కలిసిన ఎంపీకి పలువురు జర్నలిస్ట్ సంఘాల నాయకులు, జర్నలిస్ట్ లు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News