Sunday, October 6, 2024
HomeతెలంగాణMalreddy: పాదయాత్రతో మల్ రెడ్డి ప్రచారం

Malreddy: పాదయాత్రతో మల్ రెడ్డి ప్రచారం

గడప గడపకు ద్వారా ప్రచారంలో దూసుకుపోతున్న నేత

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి దూరంగా ఉందని ఆరోపించారు కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి అత్యధిక నిధులు వెచ్చించి రాష్ట్రంలోని మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.
అంతకుముందు తుర్కయంజాల్ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్థానిక నాయకులతో కలిసి మల్ రెడ్డి రంగారెడ్డి పూజలు చేశారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు.. మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో 2,3,4,5 వార్డులలో గడప గడపకు పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. గత మూడు పర్యాయాలుగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీనీ అతని అసమర్ధత వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు..మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరింత ప్రగతి పదంలోకి రావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News