Sunday, October 6, 2024
HomeతెలంగాణMalreddy: వచ్చేది కాంగ్రెస్ సర్కారే

Malreddy: వచ్చేది కాంగ్రెస్ సర్కారే

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలుంటాయి

ఇబ్రహీంపట్నం నియోజికవర్గం యాచారం మండలంకి చెందిన మాజీ పీఏసీఎస్ చైర్మన్ నాయిని సుదర్శన్ రెడ్డి..వైయసార్సీపీ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి అమృత సాగర్.. కొత్తపల్లి మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి అధ్వర్యంలో సుమారు 300 వందల మంది డిఅస్స్ఆర్ ఫంక్షన్ హాల్ లో టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అంతకుముందు యాచారం మండల కేంద్రం నుండి ర్యాలీగా విచ్చేసి స్థానిక డిఎస్ఆర్ పంక్షన్ హాల్ లో నిర్వహించిన సభకి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం కాయమని అన్నారు.

- Advertisement -

రానున్న రోజుల్లో నియోజికవర్గంలో అధికార పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని అన్నారు..ఇబ్రాహీంపట్నం నియోజికవర్గంలోని ప్రజలకు అండగా ఉంటానని యువతకి తోడుగా ఉంటాన్నారు. ఈ
కార్యక్రమంలో పార్టీ లో చేరిన నాయకులు కార్యకర్తల తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు..వివిధ మండలాల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News