Friday, September 20, 2024
HomeతెలంగాణManakonduru: పొరండ్లలో ఘనంగా పోచమ్మ బోనాలు

Manakonduru: పొరండ్లలో ఘనంగా పోచమ్మ బోనాలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో శుక్రవారం పోచమ్మ పున ప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షి కొత్సవంను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, ఆడప డుచులు బొనమేతుకుని డప్పు చప్పులు, శివ సత్తుల నృత్యాలతో ఉరేగింపుగా ఆలయానికి వెళ్లి పోచమ్మ దేవతకు మొక్కులు చెల్లించి, పిల్లా-పాప, ఇంటిల్లిపాదని చల్లగా ఉండాలని, పాడి పంటలు బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రెడ్డి త్రివేణి-తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ చింతల రజిత-లక్ష్మారెడ్డి లతో పాటు స్థానిక ప్రజాప్ర తినిధులు, వివిధ కుల సంఘాలు, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News