Saturday, November 15, 2025
HomeతెలంగాణManakonduru: బీ.ఆర్.ఎస్. ముఖ్య కార్యకర్తల సమావేశం

Manakonduru: బీ.ఆర్.ఎస్. ముఖ్య కార్యకర్తల సమావేశం

ముఖ్య అతిథులుగా రసమయి, వినోద్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ లో (8వ డివిజన్)లో ఆదివారం తిమ్మాపూర్ మండల బీ.ఆర్.ఎస్.పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాల కిషన్ లు పాల్గొని పార్టీ బలోపేతానికి నాయకులకు, శ్రేణులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ సల్ల శారద- రవీందర్, సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామి రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగల ఏకానందం, తిమ్మాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ రావుల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు జాప శ్రీనివాసరెడ్డి, నాయకులు మేంగాని రమేష్, మాతంగి లక్ష్మణ్, చిందం కిష్టయ్య తో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad