Tuesday, September 17, 2024
HomeతెలంగాణManakonduru: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రసమయి

Manakonduru: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రసమయి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి, పొలంపల్లి గ్రామాల్లో రాష్ట్ర సాంస్కృ తిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా 93 లక్షల నిధులతో మన్నెంపల్లి, పొలంపల్లి గ్రామాల్లో రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం అని, ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో సిసి రోడ్డు పనులు పూర్తి చేశామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు మేడి అంజయ్య, బొజ్జ తిరుపతి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ మండలం బిఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచ్ రావుల రమేష్, ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్, పారునంది జలపతి లతో పాటు తహసిల్దార్, ఎంపీడీవో, అధికారులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News