Friday, September 20, 2024
HomeతెలంగాణManakonduru: బోనమెత్తిన రసమయి

Manakonduru: బోనమెత్తిన రసమయి

బోనాలు సమర్పించి, బతుకమ్మలతో, ఆట పాటలతో, సహపంక్తి భోజనాలతో సంబరాలు

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఆయా గ్రామాల చెరువులు, వీధులను విద్యుత్ దీపాలతో సుందరీకరించి, గ్రామాల్లోని మహిళలు బోనాలు, బతుకమ్మలతో పలు వీధుల గుండా ర్యాలీగా ఊరంతా తిరుగుతూ చెరువుకట్ట వద్దకు చేరుకొని, బోనాలు సమర్పించి, బతుకమ్మలతో, ఆట పాటలతో, సహపంక్తి భోజనాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా తిమ్మాపూర్ గ్రామంలో బోనాల వేడుకల్లో మహిళలతో కలిసి పాల్గొన్నారు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత-దేవేందర్ రెడ్డి, సర్పంచ్ దుండ్ర నీలమ్మ-రాజ య్య, బిఆర్ఎస్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, సభ్యులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News